ఎయిర్ ఇండియా తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ మాజీ చీఫ్ టెవోల్డ్ గెబ్రేమరియమ్ను నియమించింది. ఆయన క్యాంప్బెల్ విల్సన్ స్థానంలో బాధ్యతలు చేపంటారు.
ఎయిర్ ఇండియా తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ మాజీ చీఫ్ టెవోల్డ్ గెబ్రేమరియమ్ను నియమించినట్లు బుధవారం ప్రకటించింది. సంస్థ నిరంతర నష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన ఈ బాధ్యతలను చేపట్టనున్నారు.
గతంలో సింగపూర్ ఎయిర్లైన్స్ అధికారిగా పనిచేసిన న్యూజిలాండ్కు చెందిన క్యాంప్బెల్ విల్సన్ స్థానంలో గెబ్రేమరియమ్ వస్తారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఈ విమానయాన సంస్థ ప్రస్తుతం మధ్యప్రాచ్య వివాదాలు మరియు ఇతర నిర్వహణ సమస్యల వల్ల ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది.