బైక్ టాక్సీ డ్రైవర్లపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చర్యలను నిలిపివేయాలని నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చట్టపరమైన మార్గదర్శకాలు లేనిదే డ్రైవర్లపై చర్యలు తీసుకోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
బైక్ టాక్సీ రైడర్లపై జరుగుతున్నత అణిచివేతను వెంటనే నిలిపివేయాలని 'నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్' కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు ఆదేశాల తర్వాత, చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్ మరియు కమర్షియల్ పర్మిట్ల గురించి తాము ఎన్నిసార్లు అడిగినా ఆర్టీఓ (RTO) అధికారులు ఎటువంటి స్పందన చూపలేదని అసోసియేషన్ ఆరోపించింది.
చట్టపరమైన నిబంధనలు తెలియజేయకుండా డ్రైవర్లపై జరిమానాలు విధించడం మరియు వాహనాలను స్వాధీనం చేసుకోవడం వేలాది మంది గిగ్ కార్మికుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ సలీం తెలిపారు. వాహనాలను వైట్ బోర్డు నుండి ఎల్లో బోర్డుకు మార్చడానికి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని మరియు విధాన రూపకల్పనలో తమను భాగస్వాములను చేయాలని వారు కోరారు.
మరోవైపు, బెంగళూరులో రవాణా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 54 బైక్ టాక్సీలను పరిశీలించగా, 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు తూర్పు ఆర్టీఓ పరిధిలో అత్యధికంగా తనిఖీలు జరిగాయి.