కాశ్మీర్‌లోని ఒక పౌల్ట్రీ రైతుకు పక్షి మేత అని పంపిన పార్శల్‌లో 4 కిలోల కొకైన్ మరియు ఇతర మాదక ద్రవ్యాలు లభించాయి. రైతును డ్రగ్స్ కేసులో ఇరికించి పరువు తీయాలని ఎవరో పక్కా ప్లాన్ వేశారని పోలీసులు గుర్తించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో ఒక పౌల్ట్రీ రైతుకు రావలసిన పార్శల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్శల్‌ను తెరిచి చూడగా అందులో 4 కిలోల కొకైన్, 80 గ్రాముల గంజాయి మరియు ఇతర సైకోట్రోపిక్ డ్రగ్స్ లభించాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుండి ఈ పార్శల్‌ను పంపినట్లు పోలీసులు గుర్తించారు.

విచారణలో తేలిన షాకింగ్ విషయం ఏమిటంటే, రైతు భార్య మాజీ ప్రియుడు తారిక్ అహ్మద్ సోఫీ అనే వ్యక్తి ఈ కుట్ర పన్నాడు. రైతును డ్రగ్స్ కేసులో ఇరికించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో సోఫీ ఈ ప్లాన్ వేశాడు. పోలీసులు సోఫీని అరెస్ట్ చేసి, అతనిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేశారు.