పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద శిక్షణ పొందాలని ప్లాన్ చేసినందుకు బెంగళూరులో పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఆఫ్ఘనిస్తాన్ టెరిస్ట్ గ్రూప్తో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.
పాకిస్తాన్ సైన్యంపై ఉగ్రవాద చర్యలకు పాల్పడాలని ప్లాన్ చేసినందుకు బెంగళూరు హెబ్బగోడి పోలీసులు 23 ఏళ్ల సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు. నిందితుడు అసఫుల్ మల్లిక్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) సభ్యుడితో సంబంధం కలిగి ఉన్నట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది.
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పర్గానా జిల్లాకు చెందిన మల్లిక్, జిగానీ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఆఫ్ఘన్ పౌరుడైన ఇమ్రాన్ హైదర్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని, TTPలో చేరడానికి మరియు ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లి శిక్షణ పొందడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అతను వెళ్లలేకపోయాడు.
పోలీసులు అతని మొబైల్ను పరిశీలించగా, ఇమ్రాన్ హైదర్ తో జరిగిన చాట్లు మరియు ఆడియో రికార్డింగ్లు లభించాయి. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 113(3) కింద కేసు నమోదు చేశారు.