కన్నడ నటుడు దర్శన్ ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్గా మారేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హత్యకు ముందు, తర్వాత జరిగిన ఘటనలపై పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు.
కన్నడ నటుడు దర్శన్ ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు ప్రదోష్ అప్రూవర్గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో హత్యకు ముందు, తర్వాత జరిగిన ఘటనలపై సంచలన ఆరోపణలు చేశాడు. రేణుకాస్వామిపై దాడి నుంచి మృతదేహాన్ని తరలించడం వరకు పలు విషయాలను వివరించాడు.
ప్రదోష్ పిటిషన్ ప్రకారం.. పవిత్ర గౌడకు రేణుకాస్వామి పంపిన సందేశాలపై దర్శన్ అతడిని ప్రశ్నించి తీవ్రంగా దాడి చేశాడు. ఆ సమయంలో రేణుకాస్వామి తల నుంచి రక్తం రాగా, పవిత్ర గౌడను కూడా కొట్టాలని దర్శన్ కోరాడు. దర్శన్ అతడి ఛాతిపై కాళ్లతో తొక్కినట్లు పిటిషన్లో ఆరోపించాడు. హత్య తర్వాత మృతదేహాన్ని వేరే ప్రాంతానికి తరలించి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు.
అప్రూవర్గా మారేందుకు సిద్ధమని ప్రదోష్ కోర్టుకు తెలిపగా, అతడితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు. అయితే చార్జ్షీట్లో ప్రదోష్పై కూడా హత్య, సాక్ష్యాల ధ్వంసం ఆరోపణలు ఉన్నాయి. ఈ అప్రూవర్ పిటిషన్పై బెంగళూరులోని 59వ సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.