గాజాలో పాలస్తీనియన్లపై జరుగుతున్న మారణహోమాల్లో ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించే ప్రమాదం ఉన్నప్పటికీ, భారత్ ఆయుధాలను సరఫరా చేస్తోందని అంనెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.
గాజాలో జరుగుతున్న మారణహోమాల్లో ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ, భారత్ ఇజ్రాయెల్కు ఆయుధాలను సరఫరా చేస్తోందని అంనెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక తెలిపింది. ఇజ్రాయెల్ రక్షణ రంగంతో భారత్ అత్యంత సన్నిహిత మరియు లాభదాయకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉందని, ఇది ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందని ఆ సంస్థ పేర్కొంది.
అక్టోబర్ 7, 2023 నుండి భారత్ నుండి ఇజ్రాయెల్కు పంపిన 2,596 ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు విడిభాగాలను అంనెస్టీ పరిశోధకులు విశ్లేషించారు. ఇందులో చిన్నపాటి ఆయుధాల భాగాలు, డ్రోన్ వార్హెడ్లు మరియు సైనిక వాహనాల విడిభాగాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీల ఆయుధ ఎగుమతులను నియంత్రించడంలో భారత్ విఫలమైందని అంనెస్టీ విమర్శించింది.