రష్యా సైనికులు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేశారు. ఈ వారం ప్రారంభంలో రష్యా మరియు ఉక్రెయిన్‌లలో జరిగిన దాడుల్లో కనీసం 27 మంది మరణించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.

బుధవారం తెల్లవారుజామున రష్యా దళాలు కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణెలతో దాడి చేశాయి. కీవ్ మేయర్ విటాలి క్లిచ్కో తెలిపిన వివరాల ప్రకారం, ఓబోలోన్ జిల్లాలోని 20 అంతస్తుల నివాస భవనానికి మంటలు అంటుకున్నాయి. ఈ దాడులను అడ్డుకోవడానికి గగనతల రక్షణ దళాలు రంగంలోకి దిగాయి.

రెండు జిల్లాల్లోని గిడ్డంగులు తగలబడిపోయినట్లు కీవ్ సైనిక యంత్రాంగం తెలిపింది. రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడుల నుండి ఆకాశ మార్గాన్ని రక్షించుకోవడానికి అమెరికా తయారు చేసిన పేట్రియాట్ క్షిపణి ఇంటర్‌సెప్టర్ల కోసం ఉక్రెయిన్ తన మిత్రదేశాలను కోరుతోంది.