జపాన్లోని చిబా ప్రిఫెక్చర్లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరదల్లో కనీసం నలుగురు మరణించారు మరియు ఒకరు కనిపించకుండా పోయారు. వరద ముప్పు కొనసాగుతుండటంతో 4 లక్షల మందికి పైగా ప్రజలను తరలింపునకు ఆదేశించారు.
టోక్యో సమీపంలోని జపాన్ చిబా ప్రిఫెక్చర్లో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో కనీసం నలుగురు మరణించగా, ఒకరు ఇంకా కనిపించకుండా పోయారు.
వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ, వరద ముప్పు ఎక్కువగా ఉండటంతో సుమారు 4,00,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు ఆదేశించారు.