మెల్బోర్న్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో రేఖకు ప్రతిష్టాత్మకమైన సినిమా ఎక్సలెన్స్ అవార్డు అందించనున్నారు. ఆమె నటించిన క్లాసిక్ 'ఉమ్రావ్ జాన్' చిత్రాన్ని ఈ వేడుకలో ప్రదర్శిస్తారు.
సినీ దిగ్గజం రేఖ 2026 మెల్బోర్న్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో (IFFM) గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో ఆమె చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఆమెకు ప్రతిష్టాత్మకమైన 'ఎక్సలెన్స్ ఇన్ సినిమా' అవార్డును అందజేయనున్నారు. ఆమె సినీ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ, ఆమె నటించిన మధుర జ్ఞాపకాల 'ఉమ్రావ్ జాన్' చిత్రాన్ని ఈ ఫెస్టివల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.
ఆగస్టు 15న మెల్బోర్లో భారతీయ సంతతి వారు మరియు ప్రముఖుల సమక్షంలో రేఖ భారత జాతీయ జెండాను ఎగురవేస్తారు. సినిమా తన జీవితానికి దక్కిన గొప్ప వరం అని, ఈ గౌరవాన్ని తన సహచర కళాకారులకు అంకితం చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.