ఎథనాల్ బ్లెండింగ్ వల్ల పెట్రోల్ ధరలు నియంత్రణలో ఉన్నాయని, లేకపోతే ధరలు భారీగా పెరిగేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం వల్ల సామాన్యులకు ఉపశమనం లభిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ఎథనాల్ కలపడం వల్ల ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ. 125 కి చేరే అవకాశం ఉండేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయంగా నిర్ణీత ధరలకే ఎథనాల్ కొనుగోలు చేయడం వల్ల అంతర్జాతీయ ధరల ప్రభావం తగ్గింది.
ఎథనాల్ తయారీ కోసం FCI బియ్యాన్ని తక్కువ ధరకు విక్రయించి ప్రభుత్వం నష్టపోతోందన్న ఆరోపణలను కేంద్రం కొట్టిపడేశాయి. ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) మరియు అవసరమైన నిల్వలు పూర్తి చేసిన తర్వాతే మిగులు ధాన్యం లేదా పాడైపోయిన బియ్యాన్ని ఎథనాల్ కోసం వాడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం పెట్రోల్లో ఎథనాల్ మిశ్రమం 20 శాతానికి చేరుకుంది, దీనివల్ల 2030 నాటి లక్ష్యాన్ని భారత్ ఐదేళ్ల ముందే సాధించింది. ఈ ప్రక్రియ ద్వారా దేశం రూ. 1.90 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసింది. అయితే, 20 శాతం కంటే ఎక్కువ మిశ్రమం పెంచే అంశంపై భవిష్యత్తులో శాస్త్రీయ అధ్యయనాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.