భారతీయ కార్ల పరిశ్రమ 2030-31 నాటికి 6.1 నుండి 6.3 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి. భార్గవ తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే క్రమంలో ఆటోమొబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

చిన్న కార్ల మార్కెట్ వాటా గత ఐదేళ్ల కంటే వేగంగా పెరుగుతుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి. భార్గవ తెలిపారు. జీఎస్‌టీ సంస్కరణలు ఆటోమొబైల్ రంగానికి మరియు ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చాయని ఆయన వివరించారు. కంపెనీ తన 2025-26 వార్షిక నివేదికలో ఎస్‌యూవీ (SUV) పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడం మరియు ఎగుమతులను పెంచడంపై దృష్టి సారించినట్లు పేర్కొంది.

మారుతి సుజుకి సీఈఓ హిసాషి తకుచి మాట్లాడుతూ, రాబోయే 5 నుండి 6 ఏళ్లలో 7 కొత్త ఎస్‌యూవీలను పరిచయం చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సాంకేతిక అభివృద్ధి మరియు ఉద్యోగాల సృష్టన ద్వారా 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంలో మారుతి సుజుకి భాగస్వామిగా ఉంటుందని చెప్పారు.