బైక్ టాక్సీలను ప్రజా రవాణా వాహనాలుగా పరిగణించలేమని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. భద్రతా ప్రమాణాలు మరియు ప్రమాదాల తీవ్రతను ప్రభుత్వం పేర్కొంది.
ద్విచక్ర వాహాలను టాక్సీలుగా ఉపయోగించడాన్ని నియంత్రించడం సహేతుకమని మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. మోటార్ సైకిళ్ల తక్కువ భద్రతా ప్రమాణాలు, రోడ్డు ప్రమాదాల రేటు మరియు ట్రాఫిక్ సమస్యలను ప్రభుత్వం ఎత్తిచూపింది.
పర్మిట్ల జారీ అనేది ఆటోమేటిక్ ప్రక్రియ కాదని, ప్రజా భద్రత మరియు వాహన అనుకూలత ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. మోటార్ సైకిళ్లను మోటార్ క్యాబ్స్తో సమానంగా చూడటం చట్టవిరుద్ధమని ప్రభుత్వం తన పిటిషన్లో తెలిపింది.