కాంగ్రెస్ నాయకుడు నానా పటోల్ పాదాలు కడుగుతున్న వీడియోపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ చర్య కాంగ్రెస్ నాయకుల 'సంస్కృతిని' ప్రతిబింబిస్తుందని బీజేపీ పేర్కొంది.
వైరల్ అయిన వీడియోలో, నానా పటోల్ సోఫాలో కూర్చుండగా ఇద్దరు వ్యక్తులు ఆయన పాదాలను కడుతూ, ఆయనపై పూలు చల్లుతున్నట్లు కనిపిస్తుంది.
అయితే, ఆ ఇద్దరు వ్యక్తులు తమ కుటుంబ సభ్యులేనని పటోల్ స్పష్టం చేశారు.