E20 పెట్రోల్ను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి నిరసన యాత్ర చేపట్టాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే, ఈ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
E20 పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పిటిషన్లను సమర్పించడానికి 100 మంది సభ్యులతో కూడిన బృందంతో ప్రధాని నివాసానికి పాదయాత్ర చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సచిస్తోందని ఆయన ఆరోపించారు.
అయితే, ఈ పాదయాత్ర కోసం కేజ్రీవాల్ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి అనుమతి కోరలేదని, మరియు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల కారణంగా న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలులో ఉండటంతో బహిరంగ సభలకు పరిమితులు ఉన్నాయి.