ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో మొదటిసారిగా ఎర్రకోటపై 'వందేమాతరం' గానం చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట ప్రాకారాల నుండి వరుసగా 13వ సారి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 'వికసిత్ భారత్' సంకల్పాన్ని సాకారం చేయాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిస్తారు.
ఈ ఏడాది వేడుకల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోనుంది. ఎర్రకోటపై మొదటిసారిగా 'వందేమాతరం' గీతాన్ని ఆలపించనున్నారు. దీనితో పాటు యువతను ఉత్సాహపరిచేలా ప్రత్యేక 'జెన్-జీ' (Gen-Z) ఈవెంట్ను కూడా ఏర్పాటు చేశారు.