ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 లీగ్‌గా ఐపీఎల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ఏడాది దీని వ్యాపార విలువ 11% పెరిగి 20.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

అమెరికాకు చెందిన హౌలిహాన్ లోకీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నివేదిక ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యాపార విలువ ఈ ఏడాది 11 శాతానికి పైగా పెరిగి 20.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వరుసగా రెండవ సంవత్సరం డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడం విశేషం.

2008లో ప్రారంభమైన ఈ పోటీ, బ్రాడ్‌కాస్ట్ రెవెన్యూ, స్పాన్సర్‌షిప్ మరియు ఫ్రాంచైజీ పెట్టుబడులతో ఒక బలమైన వాణిజ్య నమూనాను నిర్మించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల యజమాన్య మార్పులు, పెద్ద పెట్టుబడిదారులు ఐపీఎల్ పట్ల చూపుతున్న ఆసక్తిని చాటిచెప్పాయి.

ఐపీఎల్ బ్రాండ్ విలువ గత ఏడాది 10.3 శాతం పెరిగి 4.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఛాంపియన్ బెంగళూరు జట్టు 312 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో లీగ్‌లోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలిచింది.