శ్రీలంక వర్సెస్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్లో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఆటతీరు చూసి కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఆనందించారు.
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్కు ముందు భారత జట్టు SLC XI తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. కొలంబోలోని NCC గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్ రెండో రోజున భారత బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. దేవదత్ పడిక్కల్ సెంచరీ సాధించగా, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ ఆడారు.
అయితే అందరి దృష్టిని ఆకర్షించింది పేసర్ గుర్నూర్ బ్రార్. దిలుమ్ సుదీర వేసిన ఒకే ఓవర్లో బ్రార్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది టీమ్ ఇండియా డగ్అవుట్ను ఉర్రూతలూగించారు. కేవలం 18 బంతుల్లో 36* పరుగులు చేసిన బ్రార్ అగ్రెసివ్ బ్యాటింగ్ను చూసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చప్పట్లతో ప్రోత్సహించారు.