గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం నహాన్ లోని మెడికల్ కాలేజీకి తరలించారు. సహాయక చర్యలు వేగంగా జరిగాయి.
హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుండెపోటుతో సంగ్రా ఆసుపత్రిలో మరణించిన జగదీష్ శర్మ అనే గ్రామస్థుడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వాహనంలో ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రయాణంలో వాహనం అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని నహాన్లోని మెడికల్ కాలేజీకి తరలించారు.