ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో 271 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీలో మంటలు చెలరేగి 5 మంది మరణించగా, 41 మంది గల్లంతయ్యారు.

ఇండోనేషియా జాతీయ శోధన మరియు సహాయక సంస్థ (Basarnas) తెలిపిన వివరాల ప్రకారం, సముద్రంలో 271 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీలో మంటలు చెలరేగి 5 మంది మరణించారు మరియు 41 మంది అదృశ్యమయ్యారు. ఈస్ట్ జావాలోని సురబాయా నుండి సౌత్ సులవేసిలోని మకాసర్‌కు వెళ్తున్న సమయంలో మదురా ద్వీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

స్థానిక వార్తా సంస్థ iNews విడుదల చేసిన దృశ్యాలలో, లైఫ్ జాకెట్లు ధరించిన అనేక మంది ప్రజలు లైఫ్ బోట్లలో ఉండటం కనిపిస్తోంది. మంటలు మరియు పొగలు కమ్ముకున్న ఫెర్రీ నుండి ప్రజలు కిందకు దిగుతున్న దృశ్యాలు కూడా బయటపడ్డాయి.