స్లోవేనియాలోని భారత రాయబార కార్యాలయ గోడలపై అసభ్యకరంగా రాయడం వంటి చర్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. భారత్ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
స్లోవేనియా రాజధానిలోని భారత రాయబార కార్యాలయం ప్రాంగణాన్ని కొంతమంది వ్యక్తులు వికృతీకరించారు. దౌత్య కార్యాలయాలు పవిత్రమైనవని మరియు వాటిని గౌరవించాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ఘటనపై విచారణ జరిపి, భారత్ వ్యతిరేక శక్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్లోవేనియా ప్రభుత్వాన్ని విదేశాంగ శాఖ కోరింది.