కొలంబియాలోని పసిఫిక్ ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం 'రింగ్ ఆఫ్ ఫైర్' జోన్లో ఉంది.
కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 132 మంది మరణించారని తెలుస్తోంది. భవనాలు కూలిపోతుండగా ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసిన దృశ్యాలు బయటపడ్డాయి.
ప్రధాన భూకంపం తర్వాత మరో 21 సార్లు ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. దీనివల్ల సుమారు 1,575 ఇళ్లు, 18 ఆరోగ్య కేంద్రాలు మరియు 52 పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.