భారత కోస్ట్ గార్డ్ అధికారుల నియామకం మరియు కెరీర్ ఎదుగుదలలో లింగ సమానతను పెంపొందించేలా రాజ్నాథ్ సింగ్ కొత్త విధానాలను ప్రకటించారు. అలాగే, విధి నిర్వహణలో సముద్రంలో కనిపించకుండా పోయే సిబ్బంది కుటుంబాలకు త్వరగా పరిహారం అందించేలా నిబంధనలు సవరించారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం న్యూఢిల్లీలో భారత కోస్ట్ గార్డ్ కోసం రెండు ముఖ్యమైన మానవ వనరుల విధాన సంస్కరణలను ఆవిష్కరించారు. ఈ సంస్కరణల ద్వారా అధికారులు నియామకంలో మరియు కెరీర్ వృద్ధిలో లింగ తటస్థ చట్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మహిళా అధికారులు కూడా పురుషులతో సమానంగా షార్ట్ సర్వీస్ అపాయింట్మెంట్ (SSA) మరియు పర్మనెంట్ అపాయింట్మెంట్ (PA) ద్వారా సేవలందించే అవకాశం ఉంటుంది.
రెండవ సంస్కరణ ద్వారా, విధి నిర్వహణలో సముద్రంలో కనిపించకుండా పోయే కోస్ట్ గార్డ్ సిబ్బంది కుటుంబాలకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందించడం సాధ్యమవుతుంది. పరిపాలనాపరమైన జాప్యాన్ని తగ్గించడానికి, సదరు సిబ్బందిని 'మరణించినట్లుగా' భావించి, వారి కుటుంబాలకు తక్షణమే పరిహారం మరియు ఇతర ప్రయోజనాలను అందించే అధికారాన్ని సంబంధిత అధికారులకు కల్పించారు.