బీహార్లోని సివాన్లో పోలీసులు AK-47 తుపాకీలతో కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుపాకీ గాయాలపాలైన ముగ్గురు నిరసనకారులను పాట్నాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
బీహార్లోని సివాన్లో విద్యార్థుల నిరసనలపై పోలీసులు AK-47 తుపాకులను ఉపయోగించిన నేపథ్యంలో, ఇండియా కూటమి నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. గురువారం ఉదయం జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఈ ప్రతిపాదన వినిపించింది. కాల్పుల వల్ల కనీసం ముగ్గురు నిరసనకారులు గాయపడగా, వారు ప్రస్తుతం పాట్నాలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల ఈ అరాచక చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాల్పులు జరిపిన పోలీసు అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత చర్యలను ఎత్తిచూపడానికి పార్లమెంటు సమావేశాల సమయంలో ఈ పర్యటనను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది.