బార్సిలోనా క్యాంప్ నౌ స్టేడియం పునర్నిర్మాణ పనుల సమయంలో తలకి గాయం కావడంతో 54 ఏళ్ల కార్మికుడు మరణించారు. క్లబ్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసింది.

బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ తమ క్యాంప్ నౌ స్టేడియం నవీకరణ సమయంలో ఒక నిర్మాణ కార్మికుడు మరణించినట్లు ప్రకటించింది. శనివారం విడుదల చేసిన ప్రకటనలో, పని ప్రదేశంలో జరిగిన ఈ ప్రమాదంలో కార్మికుడు మరణించినందుకు క్లబ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది.

తలకి తగిలిన దెబ్బ వల్ల 54 ఏళ్ల కార్మికుడు మరణించినట్లు కాటలాన్ పోలీసులు తెలిపారు. ఐరోపాలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ స్టేడియం అయిన క్యాంప్ నౌ యొక్క భారీ పునర్నిర్మాణ పనులు 2023లో ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత స్టేడియం సామర్థ్యం 1,05,000 కి చేరుకుంటుంది.